మన పత్రిక, మెదక్: మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో జరిగిన ఓ కుటుంబ ఘటన తీవ్ర కలకలం రేపింది. బేబీ షవర్ (శ్రీమంతం) ఏర్పాట్ల సమయంలో ఇరు కుటుంబాల మధ్య మొదలైన విభేదాలు చివరకు పోలీస్ స్టేషన్కు చేరాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్తపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక యువతికి సుమారు ఏడాదిన్నర క్రితం అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ఇటీవల ఇరు కుటుంబాల వారు బేబీ షవర్ కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించుకునేందుకు సమావేశమవ్వగా, ఆ సమయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే గర్భంలోని శిశువుకు డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలని భర్త కోరినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు అల్లాదుర్గం పోలీసులను ఆశ్రయించారు. అందిన ఫిర్యాదు ఆధారంగా భర్త, అత్తలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ, మొబైల్ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
