మన పత్రిక, క్రైం: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసుల నిత్య గస్తీ ఉండే ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉన్న మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిర్వాహకులు ఈ దందాను సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విటులతో ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ దందా నిర్వాహకుడు తన చుట్టూ సుమారు 20 మంది అనుచరులతో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. ఎవరికి అనుమానం రాకుండా తరచూ అద్దె ఇళ్లు మారుస్తూ (దాదాపు 40 ఇళ్లు) కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు పంపిస్తూ, కోడింగ్ భాషలో వ్యవహారాలు నడిపించడం ద్వారా పోలీసుల కన్నుగప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రెండువేల మందికి పైగా కాంటాక్ట్స్తో ఈ దందాను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పోలీసుల దాడిలో పట్టుబడిన ప్రధాన నిందితుడు స్టేషన్ బెయిల్పై విడుదలై మళ్లీ అదే కార్యకలాపాలు కొనసాగించాడని సమాచారం. దీంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద స్థాయిలో ఆరేళ్లుగా ఈ దందా కొనసాగడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాధారణ కాలనీల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగడం యువతపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆరు సంవత్సరాలుగా పోలీసుల కళ్లుగప్పి ఈ వ్యవహారం సాగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ చీకటి సామ్రాజ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
