Miryalaguda: ఫోన్ చేయగానే స్పందించి రక్తదానం..

మన పత్రిక, మిర్యాలగూడ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల కోసం ఫోన్ చేయగానే తక్షణమే స్పందిస్తూ ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం స్థానిక జ్యోతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగికి రక్తం అవసరం ఉందని తెలియగానే, జానకిరామ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇలా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం తనకు ఇది … Read more

నేటి దినఫలాలు (మార్చి 25, 2026): బుధవారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మన పత్రిక, హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం.. నేటి (మార్చి 25, 2026 – బుధవారం) రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.) పంచాంగ వివరాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current … Read more

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: అణ్వాయుధాలు వద్దని ఇరాన్ అంగీకరించింది!

మన పత్రిక, వాషింగ్టన్: ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను (Nuclear Weapons) కలిగి ఉండబోమని తమతో అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలను వెల్లడించారు. “ఇరాన్ ప్రతినిధులు మాతో చర్చిస్తున్నారు, వారు చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న పాయింట్‌తోనే ఈ చర్చలన్నీ మొదలయ్యాయని … Read more

ఎస్‌ఎస్‌బీలో 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

సహస్త్ర సీమా బల్ (SSB), భారతదేశం: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సహస్త్ర సీమా బల్ (SSB) వివిధ విభాగాల్లో 233 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు సమాచారం సంస్థ పేరు సహస్త్ర సీమా బల్ (SSB) పోస్టుల పేర్లు హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ, ఎలక్ట్రీషియన్, కమ్యూనికేషన్, స్టీవార్డ్) మొత్తం ఖాళీలు 233 విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్ (సైన్స్/PCM), ఐటీఐ లేదా డిప్లమా. సంబంధిత విభాగంలో అనుభవం … Read more

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఈవీలపై 20% డిస్కౌంట్

మన పత్రిక, హైదరాబాద్: కాలుష్య నియంత్రణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వారికి 20 శాతం మేర డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోనూ రోజురోజుకూ పెరుగుతున్న … Read more

మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు: హాలియా పోలీసుల వార్నింగ్

మన పత్రిక, హాలియా: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ హెచ్చరించారు. మంగళవారం హాలియా పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు నడుపుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ.. సరైన అవగాహన లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం … Read more

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: భారత్‌లో బీర్ల కొరత.. భారీగా పెరగనున్న ధరలు!

మన పత్రిక వెబ్డెస్క్: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు భారత మద్యం ప్రియులపైనా పడనుంది. గ్యాస్ కొరత కారణంగా ఉత్పత్తి ఖర్చులు అమాంతం పెరగడంతో దేశంలో త్వరలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని, ధరలు కూడా భారీగా పెరగనున్నాయని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) హెచ్చరించింది. భారతదేశం తన సహజ వాయువు అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది. దేశానికి అవసరమైన గ్యాస్‌లో సుమారు 40 శాతం ఖతార్ నుంచే దిగుమతి … Read more

బ్రిటన్‌కు యుద్ధ భయం: 5 ఏళ్లలో యుద్ధం తప్పదంటున్న 40 శాతం ప్రజలు

మన పత్రిక వెబ్డెస్క్: బ్రిటన్ (UK) ప్రజలను యుద్ధ భయం వెంటాడుతోంది. రాబోయే ఐదేళ్లలో తమ దేశం యుద్ధంలోకి దిగే అవకాశం ఉందని 40 శాతం మంది ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఓ తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సర్వే ప్రకారం, ఒకవేళ యుద్ధం వస్తే ఆ పరిస్థితులను తాము తట్టుకోలేమని మూడింట రెండొంతుల (66 శాతానికి పైగా) మంది పౌరులు ఆందోళన వ్యక్తం … Read more

మధ్యప్రాచ్యంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు: టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టు

మన పత్రిక వెబ్డెస్క్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని లిటానీ నది వరకు (సరిహద్దు నుంచి 30 కి.మీ) తమ సైన్యం నియంత్రణలోకి తీసుకుంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంచలన ప్రకటన చేశారు. ఆయుధాల రవాణాకు ఉపయోగిస్తున్న ఐదు వంతెనలను ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఇప్పటికే పేల్చివేసింది. భద్రతపై పూర్తి భరోసా వచ్చే వరకు దక్షిణ లెబనాన్ వాసులను వెనక్కి రానివ్వబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో పది … Read more

కోనరావుపేట పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

మన పత్రిక వెబ్డెస్క్, కోనరావుపేట: చారిత్రక, సాంస్కృతిక విషయాలపై అవగాహన పెంచేందుకు కోనరావుపేట పీ.ఎం.శ్రీ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల విద్యార్థులు వరంగల్ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. ముఖ్యంగా రామప్ప ఆలయంలోని రుద్రదేవుడు, నందీశ్వరుని విగ్రహాలు, సన్నని దారం దూర్చేంత సూక్ష్మ రంధ్రాలున్న స్తంభాల పనితనం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అలాగే, నృత్య భంగిమలను తెలిపే శిల్పాలు, కాకతీయుల శిల్పకళా వైభవం, … Read more