మన పత్రిక, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకల డోన్ వద్ద ఓ బొలెరో వాహనం, లారీని బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
