Advertisement

కరీంనగర్‌లో తుపాకులు కత్తులతో బెదిరించి కోటిన్నర విలువైన సొత్తు దోపిడీ

మన పత్రిక, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని భగత్ నగర్‌లో భారీ దోపిడీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు, కుటుంబ సభ్యులను తుపాకులు, కత్తులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. భగత్ సింగ్ చౌరస్తా వద్ద నివాసముంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

దోపిడీ వివరాలు

లైట్లు ఆర్పడానికి వెళ్లిన అజ్మత్ అలీని పట్టుకున్న దుండగులు, ఇంట్లోని మహిళలను తీవ్రంగా కొట్టి బంధించారు. వారిని చంపుతామని బెదిరించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.21 లక్షల నగదుతో పాటు ఫోన్లను ఎత్తుకెళ్లారు. అనంతరం పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్‌లపై వేములవాడ బైపాస్ మీదుగా పరారయ్యారు. నిందితులు హిందీ భాషలో మాట్లాడారని బాధితులు తెలిపారు.

Advertisement

పోలీసుల దర్యాప్తు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఇంట్లో వృద్ధులు, మహిళలు మాత్రమే ఉన్నారని ముందే తెలుసుకుని ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. యజమాని అజ్మత్ అలీ తన పెద్ద అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన అల్లుడే ఈ కుట్ర పన్ని ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement