Advertisement

తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురు

మన పత్రిక: భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) ను కొట్టేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.

విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తమ్మినేని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

Advertisement
Advertisement