మన పత్రిక: దేశీయ మార్కెట్లో గురువారం పసిడి ధరలు తగ్గాయి. ఆగస్టు 26తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై గ్రాముకు రూ.77, 22 క్యారెట్ల బంగారంపై గ్రాముకు రూ.70 చొప్పున తగ్గుదల నమోదైంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1.62 లక్షలుగాను, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.49 లక్షలుగాను, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1.21 లక్షలుగాను ఉంది.
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, పుణె మరియు కేరళ ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,62,980 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,400 వద్ద నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే, ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, పుణె నగరాల్లో కిలో వెండి రూ.2,60,000 కు లభిస్తుండగా, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
