WhatsApp

Bus Accident : మరో బస్సు యాక్సిడెంట్.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

bus accident in jangaon dist telangana

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా చాలా బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ … Read more

Hijras Attack : డబ్బులు ఇవ్వలేదని ఇంటి యజమానిని చితకబాదిన హిజ్రాలు

hijras attack on house owner for not giving money in hydderabad

Hijras Attack : గృహ ప్రవేశం రోజు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఓ ఇంటి యజమానిని హిజ్రాలు చితకబాదారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో చోటు చేసుకుంది. కీసర సమీపంలోని చీర్యాల అనే ఏరియాలో ఉన్న బాలాజీ ఎన్‌క్లేవ్‌లో కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుకులను ఆ వ్యక్తి చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన హిజ్రాలు లక్ష రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు ఆ ఇంటి యజమాని నిరాకరించాడు. వెంటనే మరో … Read more

Snake Bit in Jagityal : నెల రోజుల్లో ఓ వ్యక్తిని ఏడుసార్లు కరిచిన పాము

snake bit a man seven times in one month

Snake Bit in Jagityal : ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఓ వ్యక్తిని ఓ పాము నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత నెలలో ఓ పాము కరిచింది. వెంటనే ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరోసారి అదే పాము కాటేసింది. దీంతో మరోసారి … Read more

Train Accident : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి

train collides with goods train in chhattisgarh

Train Accident : ఇప్పటికే బస్సుల ప్రమాదాలను చూసి అంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఓ రైలు ప్రమాదం మరోసారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో ప్యాసెంజర్ రైలు ప్రమాదానికి గురైంది. బిలాస్ పూర్ లో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రెయిన్ ఢీకొట్టిం. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వెంటనే సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం … Read more

Couple Suicide : విషాదం.. యువజంట ఆత్మహత్య.. భార్య గర్భిణి

husband and wife suicide in Visakhapatnam

Couple Suicide : ఏపీలోని వైజాగ్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జంట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. అయినా కూడా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెం దగ్గర వీళ్లు ఉంటున్నారు. ఆ ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. బస్సులో 70 మంది

rtc bus and lorry accident at chevella

RTC Bus Accident : ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, రూల్స్ పాటించాలని నెత్తినోరు మొత్తుకున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కంకర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో … Read more

Hit and Run Case : కారు సైడ్ మిర్రర్‌కి బైక్ తాకిందని బైకర్‌ను చంపేసిన జంట

couple kills biker by hitting him with car in bengaluru

Hit and Run Case : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని.. బైకర్ ను చేజ్ చేసి మరి తమ కారుతో ఢీకొట్టి చంపేసింది ఓ జంట. ఈ ఘటనతో అసలు మనుషుల్లో మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. కనీసం రెండు కిలోమీటర్ల వరకు ఆ బైకర్ ను కారుతో వెంటాడి మరీ కారుతో ఢీకొట్టి చంపేశారు. మనోజ్, ఆర్తి దంపతులు కారులో … Read more

TG: మెదక్ జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, కొట్టి చనిపోయిందనుకుని వెళ్లిపోయారు..!

TELANGANA: ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొల్చారం మండలంలోని సంగాయిగూడ తండాకు చెందిన, అడ్డా కూలీగా పనిచేసే ఓ మహిళ అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల అంచనా ప్రకారం శుక్రవారం ఉదయం టిఫిన్‌తో మెదక్ అడ్డాకు వచ్చిన ఈ మహిళను పని ఇస్తామని చెప్పి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల ఆలయ సమీపంలోని ఓ … Read more

కరీంనగర్: ACBకి చిక్కిన మరో అవినీతి చేప..!

TG Karimnagar: లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గంగాధర మండలం మధురా నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్‌ను శుక్రవారం ఓ లబ్ధిదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. మధురా నగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు విషయంలో కార్యదర్శి లబ్ధిదారుడిని వేధించారు. బిల్లుల కోసం అనిల్ రూ.10,000 లంచం తీసుకుంటుండగా … Read more