Hit and Run Case : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని.. బైకర్ ను చేజ్ చేసి మరి తమ కారుతో ఢీకొట్టి చంపేసింది ఓ జంట. ఈ ఘటనతో అసలు మనుషుల్లో మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. కనీసం రెండు కిలోమీటర్ల వరకు ఆ బైకర్ ను కారుతో వెంటాడి మరీ కారుతో ఢీకొట్టి చంపేశారు.
మనోజ్, ఆర్తి దంపతులు కారులో వెళ్తుండగా.. తమ కారు సైడ్ మిర్రర్ కు దర్శన్ అనే ఓ యువకుడు బైక్ తగిలించాడు. తమ కారు సైడ్ మిర్రర్ కే డ్యాష్ ఇస్తావా అని అతడిని ఫాలో అవుతూ కారుతో బైక్ ను ఢీకొట్టడంతో అతడు స్పాట్ లో మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవడంతో, ఆ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత చిన్న విషయానికి మనిషేనే చంపేస్తారా అంటూ ఆ జంటపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
