హైదరాబాద్ లో 54 మంది సీఐల బదిలీ.. ఉత్తర్వులు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నగర పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 54 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను (CI) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ ల బదిలీలు జరిగిన నేపథ్యంలో తాజాగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సీసీఎస్ సైబర్ క్రైమ్స్ విభాగం నుంచి భారీగా బదిలీలు జరిగాయి. బదిలీ అయిన వారిలో 26 మంది … Read more

2026 Bajaj Pulsar 125: ఎల్‌ఈడీ హెడ్‌లైట్, గ్రాఫిక్స్‌తో అదుర్స్.. త్వరలోనే లాంచ్!

మన పత్రిక వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో యువత నుంచి ఉద్యోగుల వరకు బజాజ్ పల్సర్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన బైక్‌గా పేరొందిన ‘పల్సర్ 125’ను బజాజ్ ఆటో సరికొత్త హంగులతో తీసుకువస్తోంది. 2026 మోడల్‌గా రాబోతున్న ఈ బైక్, పాత క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే ఆధునిక ఫీచర్లతో ముస్తాబైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్‌లు షోరూమ్‌లకు చేరుతుండటం విశేషం. కీలక మార్పులు ఇవే.. ఇప్పటికే పల్సర్ 150ని అప్‌డేట్ … Read more

మేడారంలో చారిత్రక కేబినెట్ భేటీ: మెట్రో టేకోవర్, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు

మన పత్రిక వెబ్​డెస్క్, ములుగు: చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల, ఆదివాసీ దైవాలు సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మేడారం అభివృద్ధిపై మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ ఎన్నికలకు నగారా పదవీకాలం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (2,996 … Read more

నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్: జపనీస్, జర్మన్ భాషల్లో శిక్షణ..

మన పత్రిక వెబ్​డెస్క్, ఖమ్మం: తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఏదులాపురంలో పర్యటించిన ఆయన.. దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకునేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని వెల్లడించారు. ఇంజనీరింగ్ కంటే నర్సింగ్‌కే డిమాండ్ … Read more

Sircilla Municipality Elections: సిరిసిల్ల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు.. బీసీలకు నిరాశేనా?

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పీఠం రిజర్వేషన్ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ స్థానాన్ని ‘జనరల్ మహిళ’ (General Women) కేటగిరీకి కేటాయించడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ బీసీ (పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన నేతలే ఏకచక్రాధిపత్యం వహిస్తూ వచ్చారు. అయితే, చుట్టుపక్కల గ్రామాల విలీనం, తాజా రిజర్వేషన్ మార్పుతో పీఠం బీసీల చేజారిపోతుందా? అనే ఆందోళన ఆ వర్గంలో … Read more

ఫ్రీగా రూ.5 వేలు వస్తున్నాయా? ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పండుగలు, ప్రత్యేక దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా సంక్రాంతి, రాబోయే గణతంత్ర దినోత్సవాల (Republic Day) పేరుతో సోషల్ మీడియాలో భారీ మోసం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. వాట్సాప్‌లో “ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్”, “సంక్రాంతి కానుక” అంటూ కొన్ని నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయని, వాటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా … Read more

తీర్థయాత్రలకు వెళ్లలేక.. మహిళలపై ఆఘాయిత్యాలా? కాంగ్రెస్ ఎమ్మెల్యే నీచ వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

మన పత్రిక వెబ్​డెస్క్: సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్యా (Phool Singh Baraiya) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మహిళలను ఉద్దేశించి చేసిన అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తీర్థయాత్రలు, పుణ్యకార్యాలను మహిళలపై లైంగిక దాడులతో ముడిపెడుతూ ఆయన మాట్లాడిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే నోటి దురుసు.. పార్టీ మౌనం … Read more

మెదక్‌లో కలకలం: కాళ్లకు ‘జీపీఎస్’తో రాబందు.. జనం భయం

మన పత్రిక వెబ్​డెస్క్, మెదక్: జిల్లాలోని అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఆదివారం ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పొలాల్లో సంచరిస్తున్న ఒక రాబందును చూసి స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ పక్షి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker), స్టిక్కర్లు, నంబర్లు ఉండటంతో ఇది ఏదో గూఢచారి పక్షి అయి ఉంటుందని, లేదా గ్రామానికి ఏదో కీడు జరుగుతుందని జనం భయపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ … Read more

ఏం ఆశించి.. ఎవరి కోసం రాశారు?’.. ఆ పత్రిక కథనంపై భట్టి విక్రమార్క సీరియస్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికో, అధికారాన్ని అనుభవించడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్తులను దోచుకునే బందిపోట్ల నుంచి తెలంగాణ వనరులను రక్షించి, ప్రజలకు పంచడమే తన లక్ష్యమని తేల్చిచెప్పారు. ఆరోపణలు వస్తే రద్దు చేయమన్నా.. సింగరేణి బొగ్గు సంస్థ … Read more

సంక్రాంతి రిటర్న్ జర్నీ అలర్ట్: ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా?

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: సంక్రాంతి పండుగ ముగించుకొని సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌ నగరానికి తిరిగి వస్తున్న ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించేందుకు పోలీసులు ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే: ట్రాఫిక్ … Read more