ఓటమి భయంతో సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి!

మన పత్రిక, వెబ్​డెస్క్: మెదక్ జిల్లాలో (Medak District) పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సంపల్లి పెద్ద తండాలో శంకర్ నాయక్ అనే సర్పంచ్ అభ్యర్థి అనూహ్యంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన ప్రత్యర్థి గెలుపు కోసం ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 2,000 ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలోనూ తాను ఇలాంటి కుట్రల వల్లే ఓడిపోయానని, ఇప్పుడు కూడా ధనబలం ముందు నిజాయితీ ఓడిపోతుందనే ఆవేదనతో ఈ … Read more

ల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. టీడీపీ అవిశ్వాసానికి ముందే ట్విస్ట్.

మన పత్రిక, వెబ్​డెస్క్: Nellore Mayor Sravanthi : నెల్లూరు నగరపాలక సంస్థ (Nellore Corporation) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖను నేడు కలెక్టర్‌కు అందజేయనున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన … Read more

Sreelekha Ips: మేయర్ రేసులో మాజీ డీజీపీ శ్రీలేఖ..

మన పత్రిక, వెబ్​డెస్క్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. నిన్నటి వరకు ప్రియాంక గాంధీపై పోటీ చేసిన నవ్య హరిదాస్ గురించి చర్చించుకుంటే, నేడు మాజీ ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖ విజయం హాట్ టాపిక్‌గా మారింది. 1987 బ్యాచ్‌కు చెందిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారి శ్రీలేఖ, డీజీపీ హోదాలో రిటైర్ అయిన అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి హోదాలో ఉండి కూడా, పార్టీ ఆదేశాల … Read more

డిసెంబర్ 15 నుంచి పరీక్షలు.. టైమింగ్స్ ఇవే | AP kaushalam exam schedule 2025

AP kaushalam exam schedule 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘కౌశలం’ (Work From Home Job Skill Test) అసెస్‌మెంట్ పరీక్షలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. (AP kaushalam exam date ) డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతంలో సాంకేతిక సమస్యలు, సిస్టమ్ ఎర్రర్లు లేదా సెలవుల కారణంగా పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. అభ్యర్థులు తమ సొంత గ్రామ లేదా … Read more

రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 2026 జాబ్ కేలండర్ విడుదల!

మన పత్రిక, వెబ్​డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక జాబ్ కేలండర్‌ను (Annual Job Calendar) శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏడాది పొడవునా వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. 2026 నోటిఫికేషన్ల షెడ్యూల్ ఇలా ఉంది: అభ్యర్థులు ఈ షెడ్యూల్ ఆధారంగా తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 2,832 ఖాళీలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా సమాచారం. వీటిలో కేవలం 200 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. అత్యధికంగా 2,569 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. అలాగే 62 ప్రిన్సిపల్ పోస్టులు, 110 ఫిజికల్ డైరెక్టర్, 91 … Read more

కార్పొరేటర్‌గా గెలుపు.. నవ్య హరిదాస్ ఆదర్శం.

మన పత్రిక, వెబ్​డెస్క్: కేరళ బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్ (Navya Haridas) రాజకీయ నిబద్ధత ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. సాధారణంగా ఎంపీగా పోటీ చేసిన నాయకులు, ఆ స్థాయికి తగ్గ చిన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపరు. కానీ, నవ్య హరిదాస్ మాత్రం పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి భేషజాలకు పోకుండా … Read more

సర్పంచ్ అభ్యర్థిపై కారం పొడితో దాడి!

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేళ కలకలం రేగింది. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో సర్పంచ్ అభ్యర్థి కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం.. కొమురయ్యను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందుగా ఆయన కళ్లలో కారం పొడి చల్లి, ఆపై దాడికి తెగబడ్డారు. ఊహించని పరిణామంతో బాధితుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొమురయ్య … Read more

ఉపాధి హామీ పేరు మార్పు.. కేంద్రం నిర్ణయంపై ప్రియాంక గాంధీ ఫైర్!

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు మార్గాలు, అధికార భవనాల పేర్లు మార్చిన మోదీ సర్కార్.. తాజాగా పేదలకు అండగా ఉండే ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGA) పేరును మారుస్తూ శుక్రవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకాన్ని ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా పిలవనున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం … Read more

పోలవరంపై సుప్రీం బాట.. చంద్రబాబు ప్రాజెక్టుపై రేవంత్ న్యాయ పోరాటం

మన పత్రిక, వెబ్​డెస్క్: గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. గతంలో ప్రతిపాదించిన ‘బనకచర్ల’ ప్రాజెక్టును కేంద్ర జలసంఘం నిరాకరించడంతో, చంద్రబాబు వ్యూహం మార్చి రూ. 58,700 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటిని ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ కుడి కాలువ, బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా నల్లమలసాగర్‌కు మళ్లించాలన్నది ఈ పథకం ఉద్దేశం. అయితే, … Read more