మన పత్రిక, వెబ్డెస్క్: మెదక్ జిల్లాలో (Medak District) పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సంపల్లి పెద్ద తండాలో శంకర్ నాయక్ అనే సర్పంచ్ అభ్యర్థి అనూహ్యంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన ప్రత్యర్థి గెలుపు కోసం ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 2,000 ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలోనూ తాను ఇలాంటి కుట్రల వల్లే ఓడిపోయానని, ఇప్పుడు కూడా ధనబలం ముందు నిజాయితీ ఓడిపోతుందనే ఆవేదనతో ఈ పని చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శంకర్ నాయక్కు నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేశారు. అక్రమాలపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
