Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈదురుగాలులు వీచే అవకాశం

low pressure in bay of Bengal

Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా అల్పపీడనం ప్రారంభమై.. అది వాయువ్య దిశగా కదులుతోంది. గురువారం లోపు అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇదే అల్పపీడనం మరో రెండు రోజుల్లో తమిళనాడు, పాండిచ్చేరి వైపు కదిలి మరింత బలపడే చాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో 55 కిమీల వేగంతో … Read more

AP CM Chandrababu : ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

ap cm Chandrababu comments about politics

AP CM Chandrababu : తాను ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలి. స్టూడెంట్ గా చాలా హ్యాపీగా ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది క్లాస్ లో. నేను గాని రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. అది నా విజన్.. అంటూ ఓ వేదిక మీద సీఎం … Read more

KTR : వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

ktr meets ys jagan in bengaluru

KTR : తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపు తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. వీళ్లిద్దరి భేటీతో ఒక్కసారిగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

Travels Bus Accident : మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

another bus accident in chittor dist in ap

Travels Bus Accident : ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్ట హైవేపై చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

BTech Student Died : ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు ఢీకొని యువతి మృతి

btech student dies after being hit by train in nellore

BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది. అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును … Read more

Balakrishna : పశువుల ఆసుపత్రికి ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

nandamuri Balakrishna inaugurates veterinary hospital

Balakrishna : హిందూపూర్ ఎమ్మెల్యే, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పశువుల ఆసుపత్రికి ప్రారంభించారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5 లక్షలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.

Betting Loss : బెట్టింగ్‌లో లక్షలు కోల్పోయి సూసైడ్ చేసుకున్న యువకుడు

youth commits suicide after loosing lakhs in betting

Betting Loss : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ లో లక్షలు పెట్టి లాస్ అయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల అఖిల్ బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. కానీ, సంగారెడ్డిలోనే ఓ  హోటల్ లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ … Read more

Olluru Royal Lake : తెగిన చెరువు కట్ట.. మునిగిన గ్రామం

flood waters surge into kalaaturu in Tirupati dist

Olluru Royal Lake : ఓ చెరువు తెగి గ్రామం మొత్తం మునిగిపోయింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో ఉన్న ఒళ్లూరు రాయల్ అనే చెరువుకు గండిపడింది. దీంతో చెరువు పక్కనే ఉన్న కళత్తూరు అనే గ్రామం నీట మునిగింది. ఒక్కసారిగా వరద గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అందరూ ప్రాణభయంతో ఇళ్లపైకి ఎక్కారు. ఈనేపథ్యంలో వరద నీటికి పశుపక్ష్యాదులు కొట్టుకుపోయాయి.

Bike Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు యువకులు మృతి

two youth die after speeding bike collides with lorry in bapatla

Bike Accident : ఏపీలోని బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లో చనిపోయారు. బాపట్లలోని గడియారం స్తంభం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చీరాల రూట్ నుంచి వస్తున్న లారీని సూర్యలంక రూట్ నుంచి వస్తున్న బైక్ అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద పడిపోయిన ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి … Read more

ఉపాధ్యాయురాలి వివాదం.. కాళ్లు నొక్కించుకున్న ఘటన కలకలం

srikakulam teacher students massage incident

మన పత్రిక, వెబ్​డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహం రేపగా, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించారు. అధికారులు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.