AP Kaushalam Exam New Schedule 2025: మిస్ అయిన వారికి గోల్డెన్ ఛాన్స్.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాంకేతిక కారణాలతో ‘కౌశలం’ (Work From Home Job Skill Test) పరీక్ష రాయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 12, 2025 వరకు పరీక్షలు నిర్వహించేలా రీ-షెడ్యూల్ విడుదల చేసింది. ఎవరికి అర్హత? మొదటి విడతలో సర్వర్ సమస్యలు, లాగిన్ ఇబ్బందులు లేదా వ్యక్తిగత కారణాల వల్ల పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష రాయవచ్చు. సొంత గ్రామ/వార్డు సచివాలయాల్లోనే … Read more

Andhra Pradesh Sachivalayam Details

Know Your Sachivalayam Details: మీ సచివాలయంలో పనిచేసే సిబ్బంది పూర్తి వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా PDF రూపంలో సులభంగా పొందవచ్చు. పేరు, మొబైల్ నెంబర్, CFMS ID లేదా ఆధార్ చివరి 4 అంకెలను ఎంటర్ చేసి ఎవరైనా తమ సచివాలయ సిబ్బంది లిస్టును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే భద్రతా కారణాల వల్ల ఫోన్ నెంబర్లు మాస్క్ చేసి ఉంటాయని గమనించాలి. Know Your Sachivalayam Details by manapatrika.com Know Your Sachivalayam … Read more

APSRTC Bus : సీటు కోసం ప్రయాణికుడి జుట్టు పట్టుకొని కొట్టిన మహిళలు

woman beats male passenger in tuni in rtc bus

APSRTC Bus : ప్రస్తుతం ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం నడుస్తోంది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఏపీ వ్యాప్తంగా ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలు ప్రయాణం చేయొచ్చు. అందుకే ఆర్టీసీ బస్సులలో మహిళల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడి జుట్టు పట్టి మహిళలు కొట్టారు. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. సీటులో ప్రయాణికుడు కూర్చొన్నాడని అతడిపై … Read more

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి

pawan kalyan must apologize says mla Anirudh reddy

Pawan Kalyan : తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్లనే కోససీమలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మా దిష్టి తగిలితే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా? పవన్ కళ్యాణ్ అలా … Read more

Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈదురుగాలులు వీచే అవకాశం

low pressure in bay of Bengal

Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా అల్పపీడనం ప్రారంభమై.. అది వాయువ్య దిశగా కదులుతోంది. గురువారం లోపు అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇదే అల్పపీడనం మరో రెండు రోజుల్లో తమిళనాడు, పాండిచ్చేరి వైపు కదిలి మరింత బలపడే చాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో 55 కిమీల వేగంతో … Read more

AP CM Chandrababu : ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

ap cm Chandrababu comments about politics

AP CM Chandrababu : తాను ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలి. స్టూడెంట్ గా చాలా హ్యాపీగా ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది క్లాస్ లో. నేను గాని రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. అది నా విజన్.. అంటూ ఓ వేదిక మీద సీఎం … Read more

KTR : వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

ktr meets ys jagan in bengaluru

KTR : తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపు తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. వీళ్లిద్దరి భేటీతో ఒక్కసారిగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

Travels Bus Accident : మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

another bus accident in chittor dist in ap

Travels Bus Accident : ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్ట హైవేపై చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

BTech Student Died : ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు ఢీకొని యువతి మృతి

btech student dies after being hit by train in nellore

BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది. అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును … Read more

Balakrishna : పశువుల ఆసుపత్రికి ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

nandamuri Balakrishna inaugurates veterinary hospital

Balakrishna : హిందూపూర్ ఎమ్మెల్యే, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పశువుల ఆసుపత్రికి ప్రారంభించారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5 లక్షలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.