టీటీడీ వేద పాఠశాలల్లో టీచింగ్ స్టాఫ్ భర్తీ..

మన పత్రిక వెబ్​డెస్క్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలనా వ్యవహారాలపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సమీక్ష నిర్వహించారు. టీటీడీ వేద పాఠశాలల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అంతర్గత ఆడిట్ సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు విభాగాల పనితీరుపై దిశానిర్దేశం చేశారు. కల్యాణ మండపాలపై సమగ్ర నివేదిక దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహణలో ఉన్న కల్యాణ మండపాల … Read more

నీటి విషయంలో తెలుగువారు కలిసే ఉండాలి.. కాళేశ్వరంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన.. భాషాపరంగానే కాకుండా జలాల విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండాలని ఆకాంక్షించారు. మాతృభాషను కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని, భాషతో పాటు అభివృద్ధి విషయాల్లోనూ తెలుగువారంతా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. మాతృభాష అమ్మతో సమానం మాతృభాష అమ్మతో సమానమని, పరభాష వ్యామోహంలో పడి మూలాలను మర్చిపోవద్దని చంద్రబాబు … Read more

భోగాపురంలో: ఉత్తరాంధ్రకు పండుగ రోజు.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఇదొక మర్చిపోలేని రోజు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (జనవరి 4) తొలి విమానం (ట్రయల్ రన్) విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా టెస్ట్ ఫ్లైట్ ఉదయం 11 గంటలకు సురక్షితంగా దిగడంతో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే జూన్ నాటికి మిగిలిన 4 … Read more

10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత.. | Tirumala Tirupati Devasthanam

మన పత్రిక, వెబ్​డెస్క్: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ వేళల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. 2026 మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 8:30 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత … Read more

Bhogapuram Airport: ఎయిర్‌పోర్ట్‌కు తొలి విమానం..

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తొలి విమానం దిగనుంది. ట్రయల్ రన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతలో 96 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 2203 ఎకరాల్లో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. అబ్బురపరిచే విశేషాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, … Read more

ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కారణం ఇదే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే యముడిగా మారి ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మృతులను కావ్య (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. … Read more

అమరావతిలో హైకోర్టు పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. తాజాగా వివిధ సంస్థలకు 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాసిల్ వుడ్స్, సెయింట్ మేరీస్ స్కూల్, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, బ్యాంకులు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 12.66 ఎకరాలను కేటాయించారు. గతంలో ఇచ్చిన 42.30 ఎకరాల్లో స్వల్ప మార్పులు చేశారు. మరోవైపు, ప్రతిష్టాత్మక హైకోర్టు నిర్మాణంలో కీలకమైన ర్యాప్తు (Raft) … Read more

రైతులకు రూ. లక్ష రుణం.. అర్హతలు, నిబంధనలు ఇవే.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతులకు (Tenant Farmers) తీపి కబురు అందించింది. పెట్టుబడి సాయం కింద వారికి కూడా రూ. లక్ష వరకు రుణం (Loan) అందజేయాలని నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా ఈ రుణాలను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికారులు అర్హులైన కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రుణం పొందేందుకు అర్హతలు & నిబంధనలు: ఎవరికి వర్తించదు? అసైన్డ్ భూములు సాగు … Read more

కలెక్టర్లకు సీఎం చంద్రబాబు క్లాస్.. పాలనలో ఆ రెండూ ఉండాల్సిందే! | Chandrababu naidu

మన పత్రిక, వెబ్​డెస్క్: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ పని చేసినా పూర్తి వివరాలతో, స్పష్టతతో ముందుకు వెళ్లాలని సూచించారు. లక్ష్యాలను ముందే నిర్ణయించుకుని, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. కేవలం రోజువారీ పనులు కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల్లో పనులు సాగుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని తెలిపారు. నిత్య విద్యార్థిలా ఉండాలి.. ప్రభుత్వంలో … Read more

ఢిల్లీ వెళ్లాల్సిన లోకేశ్ విమానం జైపూర్‌కు మళ్లింపు.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తర భారతదేశంలో కమ్మేసిన దట్టమైన పొగమంచు (Fog) విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరగా, అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని జైపూర్‌కు (Jaipur) మళ్లించారు. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇప్పటివరకు దాదాపు 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. … Read more