మన పత్రిక: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా యుద్ధ భయాలు, ఆర్థిక ఒత్తిళ్లు పెట్టుబడిదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అంతేకాకుండా అమెరికన్ డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. యుద్ధ పరిస్థితులు ప్రారంభం కావడానికి ముందు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,90,000 వరకు ట్రేడ్ అయింది. అయితే యుద్ధం మొదలైన వెంటనే మార్కెట్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుని ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1.5 లక్షల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం, సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,920 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,340 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,190గా నమోదైంది. ఇక వెండి విషయానికి వస్తే, కిలో వెండి ధర రూ.2,54,900గా ఉండగా, 100 గ్రాముల వెండి ధర రూ.25,490గా ఉంది. ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,920గా ఉంది. ఢిల్లీలో రూ.1,51,070 కాగా, చెన్నైలో రూ.1,52,170గా నమోదైంది. అలాగే సూరత్లో రూ.1,50,970గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుండగా, పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
