Advertisement

ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఈ ప్రయోజనం పొందనున్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం లక్ష్యం. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 19న, తమిళనాడు ఎన్నికలు 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న ఆయా రాష్ట్రాల ఓటర్లు సులభంగా తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయగలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement