మన పత్రిక, సినిమా: ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ మ్యారేజ్ లైఫ్ను ఆస్వాదిస్తూ కూడా పనిలో ఏమాత్రం విరామం ఇవ్వడం లేదు. ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా అనంతపురంలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగనున్న ఈ షెడ్యూల్లో విజయ్, రష్మికలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే షూటింగ్లో పాల్గొంటున్న ఈ జంట డెడికేషన్కు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు వైరల్గా మారాయి.
