Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా.. బుధవారం ‘ఎల్ నినో’పై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి నేటి వరకు జరగాల్సిన సమావేశాలను ఒక రోజు పొడిగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగే సభలో ‘ఎల్ నినో’ పరిస్థితులు, వర్షాభావాలను ఎలా ఎదుర్కోవాలి, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

కాగా, శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ’22ఏ’ భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. 22ఏ జాబితాలో అసలు ఎన్ని భూములున్నాయనే లెక్కలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. భూభారతి వచ్చాక కూడా తప్పిదాలు జరుగుతున్నాయని, లేని భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏలేటి నిలదీశారు.

Advertisement
Advertisement