మన పత్రిక: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిని పోలీసులు భారీగా చుట్టుముట్టారు. సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఏ3గా చేర్చారు. తన కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో సోంపేట కోర్టులో అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అలాగే ఆయన కుమారుడి కోసం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈ కేసులో మాజీ మంత్రికి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- ఏలూరులో చైన్ స్నాచర్ అరెస్ట్, బంగారు ఆభరణం స్వాధీనం
- నీట్ పరీక్ష నిరసనలకు మద్దతు తెలిపినందుకు మోహన్లాల్ కుమార్తె విస్మయపై ట్రోలింగ్
- నడిరోడ్డుపై ఆగిపోయిన కారును తోసి యువతికి సాయం చేసిన ఆర్మీ జవాన్
- ముంబైలో నటి ఆయేషా ఖాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాజమండ్రి షూటింగ్ సెట్లో గాయపడిన నందమూరి బాలకృష్ణ
