Advertisement

గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ నాగమోహన్ రావు

మన పత్రిక, సికింద్రాబాద్: గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ (అకడమిక్-యూజీ)గా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగ అధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ కె. ఇందిర జూలై 13, 2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

డాక్టర్ నాగమోహన్ రావు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి బాధ్యతలతో పాటు, అదనంగా వైస్ ప్రిన్సిపల్ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. ఈ నియామకంపై కళాశాల అధ్యాపకులు, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర్వుల ప్రతిని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, అకౌంట్స్ సెక్షన్ మరియు ఇతర విభాగాలకు పంపినట్లు యాజమాన్యం పేర్కొంది.

Advertisement

డాక్టర్ నాగమోహన్ రావు నేపథ్యం

గతంలో డాక్టర్ నాగమోహన్ రావు నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) ఇన్-ఛార్జి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన గాంధీ మెడికల్ కాలేజీకి బదిలీపై వచ్చి, ప్రస్తుతం వైస్ ప్రిన్సిపల్ పదవిని చేపట్టారు.

Advertisement