మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన దృఢ సంకల్పమని ఆయన ఉద్ఘాటించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన మయూరి రఘునాథ్ రెడ్డికి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు: నలుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్పైనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీసు పని చేసుకున్న ఉద్యోగి
- పాస్పోర్టు ఫీజు పెంపుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
- తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్ల నిధుల విడుదల
- తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించాం: అచ్చెన్నాయుడు
