Advertisement

ఈనెల 24న ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా

మన పత్రిక, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘మెగా జాబ్ మేళా – 2026’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఈనెల 24వ తేదీన ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

ఈ మేళాలో 70కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని, 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. దీనిద్వారా సుమారు 5,000 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఐటీ & బీపీవో, సేల్స్ అండ్ మార్కెటింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ సహా పలు ప్రైవేట్ రంగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయి.

Advertisement

10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఈ మేళాకు హాజరుకావచ్చని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్యూఆర్ కోడ్ ద్వారా లేదా నిబంధనల ప్రకారం సంబంధిత వెబ్‌సైట్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.

Advertisement