మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: పాల కోసం ఏడుస్తోందని ఆగ్రహించిన ఓ తల్లి.. ఆరు నెలల పసికందును ఊపిరాడకుండా చేసి చంపేసిన అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో జరిగింది.
తమిళనాడుకు చెందిన వెంకటేశ్కు, హేమావతితో 2018లో వివాహమైంది. వీరికి కుమారుడు రుత్విక్(5), కుమార్తె జోషిక(6 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ పనికి వెళ్లిన కొద్దిసేపటికే హేమావతి ఫోన్ చేసి.. “నీకో బ్యాడ్ న్యూస్, నాకో గుడ్ న్యూస్.. పాపను చంపేశాను” అని చెప్పింది. కంగుతిన్న ఆయన ఇంటికి చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల విచారణలో హేమావతి తన నేరాన్ని అంగీకరించింది. పాప ఏడుస్తుండటంతో కోపం తట్టుకోలేక ముక్కు, నోరు మూసేసి ప్రాణాలు తీశానని తెలిపింది. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
