మన పత్రిక, తిరుమల: తిరుమల కొండపై శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు గాను టీటీడీ మరియు పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారు. కొండపై ‘నో హారన్’ జోన్ నిబంధన అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాలు నడిపే భక్తులు మరియు డ్రైవర్లు ఈ రూల్ పాటించకపోతే కేసులతో పాటు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఈ నిబంధనల అమలులో భాగంగా గడిచిన 6 నెలల కాలంలో రూల్స్ ఉల్లంఘించిన 42 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. తిరుమలలోని రహదారులపై వాహనాల రాకపోకలను గమనించేందుకు 2000కు పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. కొండపై ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు భక్తులు మరియు వాహనదారులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- దిల్లీ వర్సిటీ అడ్వైజరీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- మాజీ మంత్రి జలగం ప్రసాదరావు భద్రత ఉపసంహరణను సమర్థించిన హైకోర్టు
- నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసిన అర్జున్ దాస్ క్రైమ్ కామెడీ సినిమా ‘కాన్ సిటీ’
- టీవీవీపీ నియామకాలలో వివక్ష చూపుతున్నారని వైద్యుల ఆందోళన
- విద్యార్థుల నిరసనలపై దాఖలైన పిటిషన్ను తిరస్కరించినట్లు వచ్చిన వార్తలను ఖండించిన సీజేఐ
