మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలింగ్ సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్ (REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025) ను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఈ పెరిగిన చెల్లింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి టి.ఏ (TA), డి.ఏ (DA) మరియు ఇతర అలవెన్సులను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే సిబ్బంది శ్రమను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
