Advertisement

సిరిసిల్ల జిల్లాలో వింత ఆచారం: వర్షాల కోసం జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్థులు

మన పత్రిక, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్థులు జెట్టక్కను ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టారు. వర్షాకాలం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ వింత ఆచారాన్ని నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ గండి నారాయణ తెలిపారు.

గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల సభ్యులు కలిసి ఇంట్లోని పాత వస్తువులు, బట్టలు, చీపురు కట్టలను సేకరించారు. డప్పుల మోతలతో ఊరేగింపుగా ఆ వస్తువులను గ్రామ శివారు వరకు తరలించి పడేశారు. దరిద్ర దేవతగా భావించే జెట్టక్కను పంపడం ద్వారా లక్ష్మీదేవి (Lakshmidevi) గ్రామంలోకి వస్తుందని వారు నమ్ముతున్నారు. పంటలు పండాలని కోరుతూ భవిష్యత్తులో కప్పతల్లి ఆట, వరుణ యాగం కూడా నిర్వహించనున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

Advertisement
Advertisement