Advertisement

Petrol Diesel Price Hike | మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వారం రోజుల్లోనే రెండోసారి

మన పత్రిక, హైదరాబాద్: నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇంధన ధరల భారం మరింత పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా, తాజా సవరణలో లీటరుకు సుమారు 90 పైసల చొప్పున పెంచిన రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

ఈ పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.79 కి చేరగా, డీజిల్ రూ. 99.86 కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 113.54 కి, డీజిల్ ధర రూ. 101.24 కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ రూ. 91.58 కి చేరగా, కోల్‌కతాలో అత్యధికంగా పెట్రోల్‌పై 96 పైసలు పెరిగింది. ముంబయి, చెన్నై నగరాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. ఈ వరుస పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై పరోక్ష ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement