Advertisement

సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ప్రధాని మోడీ పేరు

మన పత్రిక, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి తన ఇంట్లోనే అతను ఉరి వేసుకుని మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించి మృతుడు వదిలి వెళ్ళిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని ఆ లేఖలో అతను పేర్కొన్నట్లు స్థానికులు తెలిపారు. తన కుటుంబ సభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం జరపాలని కూడా ఆ లేఖలో కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement