మన పత్రిక, వెబ్డెస్క్: నల్గొండ జిల్లాలో (Nalgonda District) ఓ యువతి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన బోయపల్లి అనూష (21) ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం సాధించినప్పటికీ, ప్రజాసేవపై మక్కువతో ఆ కార్పొరేట్ ఆఫర్ను తిరస్కరించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.
బీఆర్ఎస్ (BRS) మద్దతుతో పోటీ చేసిన అనూష, సీనియర్ నాయకురాలిపై 182 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పిన్న వయసులోనే సర్పంచ్ గా గెలిచి గ్రామస్థుల మన్ననలు పొందారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తేనే గ్రామాల రూపురేఖలు మారుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని అనూష ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
