Advertisement

మొబైల్ రీఛార్జ్ ధరలు తగ్గనున్నాయి: ట్రాయ్ కొత్త ప్రతిపాదనలు

మన పత్రిక, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Telecom Regulatory Authority of India) వినియోగదారుల కోసం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ప్రస్తుతం వినియోగదారులు వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ కోసం డేటాతో కూడిన ఖరీదైన ప్లాన్లను తీసుకోవాల్సి వస్తోంది. ఈ అనవసర ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ట్రాయ్ కొత్త డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది.

ఈ నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ రీఛార్జ్ ధరలు సుమారు 50 నుండి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. కస్టమర్లు తమకు అవసరమైన సేవలను మాత్రమే ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. స్టేక్ హోల్డర్ల అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా టెలికాం రంగంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement