Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదు : రాజాసింగ్
Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ చనిపోతోంది.. కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో 50 ఏళ్లు అయినా.. ఆ తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు.