TG Digital Health Profile: సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్

మన పత్రిక, సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ వ్యవస్థను తీసుకువస్తోంది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు అమలు, ముందస్తు ఏర్పాట్లు, సాంకేతిక సదుపాయాలపై ఆయన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ పైలట్ ప్రాజెక్టును … Read more

Ustaad Bhagat Singh : రికార్డులకు ముహూర్తం ఫిక్స్ అయింది… ఈ సారి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది..

Ustaad Bhagat Singh Trailer release update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న భారీ మాస్ ప్రాజెక్ట్ Ustaad Bhagat Singh నుంచి ఫైనల్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ తుఫాన్ సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కు … Read more

School Of Agriculture: ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్..

మన పత్రిక, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం కోసం ప్రత్యేకంగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం, ఐటీ, ఏఐ, క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం కూడా ఒక బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. రైతులకు ఆర్థిక … Read more

Gas Cylinder Shortage: దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత..

మన పత్రిక, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. ఇరాన్ ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ మార్గాన్ని మూసివేయడంతో భారత్‌కు గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, వాణిజ్య అవసరాలకు గ్యాస్ అందక దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు, ముంబై నగరాల్లో గ్యాస్ సరఫరా లేక ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడ్డాయి. ముంబైలో … Read more

ఖమ్మంలో కవిత అరెస్టు.. హైదరాబాద్‌కు తరలింపు

మన పత్రిక, ఖమ్మం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఖమ్మంలో పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, హైదరాబాద్‌కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కవిత ఆరోపించారు. ఆ బాధితులకు అండగా నిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌తో … Read more

Hyderabad: కూకట్‌పల్లిలో నల్లచెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

మన పత్రిక, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని కూకట్‌పల్లిలో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నల్లచెరువును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు వద్ద గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నగరంలో రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా హైదరాబాద్‌ను మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైడ్రా … Read more

కంచే చేను మేసిన చందం.. చాట్‌జీపీటీతో మాస్ కాపీయింగ్, 81 మంది సిబ్బంది సస్పెండ్!

మన పత్రిక వెబ్​డెస్క్: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్న కృత్రిమ మేధ (AI) సాంకేతికత.. పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు ఎలా వాడుకుంటున్నారో మహారాష్ట్రలో జరిగిన ఓ విస్తుపోయే ఘటన తేటతెల్లం చేసింది. మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టడానికి సాక్షాత్తూ ఇన్విజిలేటర్లే (పరీక్షా సిబ్బంది) ‘చాట్‌జీపీటీ’ని (ChatGPT) వాడి సమాధానాలు చెప్పినట్లు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై సీరియస్ అయిన మహారాష్ట్ర విద్యాశాఖ.. అక్రమాలకు సహకరించిన 81 మంది … Read more

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికల మధ్య సంచలన ప్రకటన!

మన పత్రిక వెబ్​డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు, ఇజ్రాయెల్-అమెరికా దాడుల ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ నూతన (మూడవ) సుప్రీం లీడర్‌గా దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన 56 ఏళ్ల సయ్యద్ మొజ్తాబా హొస్సేని ఖమేనీని (MOJTABA KHAMENEI) ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎంపిక ఎలా జరిగిందంటే.. 88 మంది ఇస్లామిక్ మత గురువులతో కూడిన ఇరాన్ ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (Assembly of Experts) ఆదివారం ప్రత్యేకంగా … Read more

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడే కొనడం మంచిదా?

gold prices

గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు మరియు డాలర్ విలువ బలపడటంతో భారత్‌లో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. కేవలం గత రెండు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు ₹1,500 నుండి ₹2,000 వరకు ధర తగ్గడం విశేషం. నేటి ధరలు ఇలా ఉన్నాయి (మార్చి 9, 2026): హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల … Read more

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం: పాతబస్తీకి మెట్రో కల నిజం కాబోతోంది!

Hyderabad metro

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఐటీ ఉద్యోగులు మరియు పాతబస్తీ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Hyderabad Metro Phase-2 విస్తరణ పనులను వచ్చే నెల నుంచే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారులను ఆదేశించింది. సుమారు 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలను ఈ దశలో నిర్మించనున్నారు. ముఖ్యమైన మార్పులు మరియు కొత్త రూట్లు: ఈ రెండో దశలో ప్రధానంగా … Read more