మన పత్రిక: 2026లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన టోర్నీగా నిలిచింది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచి, ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై విజయం సాధించింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత స్పెయిన్ ఈ ఘనతను అందుకుంది. ఈ టోర్నీలో మొత్తం ప్రైజ్ మనీని 6,300 కోట్లుగా ప్రకటించగా, విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు 481 కోట్ల రూపాయలు దక్కాయి.
ఈ టోర్నీలో టికెట్లు, ఆహార పదార్థాలు మరియు ఇతర సదుపాయాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. మ్యాచ్ చూసేందుకు సగటు టికెట్ ధర 45,000 రూపాయలుగా ఉండగా, అఫీషియల్ హాస్పిటాలిటీ సీటు టికెట్ ధర 62,000 రూపాయలుగా నిర్ణయించారు. మైదానంలో వాటర్ బాటిల్ ధర 500, చికెన్ ఫ్రై ప్లేట్ 1,800, మరియు ఒక బీర్ ధర 1,800 రూపాయలుగా ఉంది. అలాగే, వాహన పార్కింగ్ కోసం ఒక వాహనానికి 7,200 రూపాయలు వసూలు చేశారు. 40 మంది గెస్టులు కూర్చునే వీలున్న ప్రైవేట్ కప్ సూట్ కోసం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చయింది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
