మన పత్రిక వెబ్డెస్క్, జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఏకపక్షంగా సాగిన ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు.
ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు అధికారికంగా 10 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ 10 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు ఇక్కడ కనీసం ఖాతా తెరిచే అవకాశం కూడా దక్కలేదు.
ఇంకా 5 వార్డుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ (8 సీట్లు)ను దాటేసింది. దీంతో ధర్మపురి మున్సిపల్ పీఠం హస్తం పరం కావడం ఖాయమైంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బలమైన స్థానిక నాయకత్వమే ఈ ఏకపక్ష విజయానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అద్భుత విజయంతో ధర్మపురి పురవీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాలుస్తూ భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
