Advertisement

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

మన పత్రిక: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 5.30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన స్వామి, అక్కడే పాయింట్ బ్లాంక్‌లో తనను తాను కాల్చుకున్నారు.

ఈ ఘటన జరిగిన చోట పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement