మన పత్రిక, శంషాబాద్: ఎయిర్పోర్ట్కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జులై 20న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్కు బయలుదేరిన మహిళ ప్రయాణిస్తున్న క్యాబ్ను డ్రైవర్ మార్గమధ్యంలో దారి మళ్లించాడు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సాంక్టా మారియా స్కూల్ సమీపంలో వాహనాన్ని ఆపి, టాయిలెట్కు వెళ్తానని చెప్పి తిరిగి వచ్చి వెనుక సీటులో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిద్ధాంతిలో నిందితుడు ఎర్రపోగు ప్రశాంత్ కుమార్(23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని రిమాండ్కు తరలించింది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- తల్లికి వందనం పథకం: అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ
- ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు
- గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే
- కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక
- షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా
