మన పత్రిక వెబ్డెస్క్, మంచిర్యాల: క్యాతన్పల్లి మున్సిపాలిటీ వద్ద మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 17న జరిగిన ఈ దాడి ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా.. పోలీసులు సుమన్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
తాజాగా ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి ఏ. వీరయ్య షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. సుమన్ రూ.25 వేల డిపాజిట్ సమర్పించాలని, మిగతా ముగ్గురు నిందితులు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. సుమన్ విడుదలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్ర అని, అంతిమంగా న్యాయమే గెలిచిందని కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
- హీరోయిన్లను ఆ యాంగిల్స్లో ఫోటోలు తీస్తారా? కెమెరామెన్లపై ‘కాంతార’ సప్తమి గౌడ సంచలన వ్యాఖ్యలు!
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
