TG Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి గానూ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు జూన్ 11న అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో నేరుగా మార్కులను తనిఖీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘TS Inter … Read more

Suryapet : ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..

మన పత్రిక, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఈటూరు గ్రామంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగస్వామి (33) గ్రామం నుంచి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో లింగస్వామి తలకు బలమైన గాయమైంది. … Read more

NEET UG 2026 : నీట్​ యూజీ రీ-ఎగ్జామినేషన్​కి భారీ భద్రత!

మన పత్రిక: జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, త్వరలో అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో దేశంలోని 551, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. గతంలో పేపర్ … Read more

School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక: Telangana రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13వ తేదీన రెండో శనివారం, అలాగే 14వ తేదీన ఆదివారం వరుసగా సెలవు దినాలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలవుల సర్దుబాటులో … Read more

కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

మన పత్రిక, కోహెడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో రూ.2,300 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 240 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. పండ్ల మార్కెట్‌తో పాటు అదే ప్రాంగణంలో … Read more

Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, పలు విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 31తో ముగియాల్సిన సెలవులు తాజా నిర్ణయంతో పొడిగించబడ్డాయి. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓయూ బాటలోనే … Read more

TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్ 2026 ఎడిషన్‌కు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 … Read more

TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్..

TG Employees Health Scheme

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ (EHS)ను పారదర్శకంగా అమలు చేసేందుకు ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నేడు (మే 31) సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), … Read more

AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి

మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన … Read more

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డి

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గ్రూప్-1 ద్వారా గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన శ్రీజా రెడ్డి ఇటీవల తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను మిర్యాలగూడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఇప్పటివరకు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. RohithRohith is a Chief Editor … Read more