Kesamudram Municipal Election Results 2026: కేసముద్రంలో ‘టై’ టెన్షన్

మన పత్రిక వెబ్​డెస్క్, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టకపోవడంతో ఫలితాలు ‘టై’గా ముగిశాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నెలకొన్న పరిణామం సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది. మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, ఫలితాలు ఇరు ప్రధాన పార్టీల మధ్య సమానంగా పంపిణీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 8 … Read more

Nereducherla Municipal Results 2026: నేరేడుచర్లలో ఖాతా ఓపెన్..

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ (JanaSena) సంచలనం సృష్టించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, జనసేన తన ఉనికిని చాటుకుంటూ జిల్లాలో బోణీ కొట్టింది. ఓటర్లు ‘గాజు గ్లాసు’ గుర్తుకు జై కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు గాను ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో … Read more

Gummadidala Municipal Results 2026: గుమ్మడిదలలో గులాబీ జెండా

మన పత్రిక వెబ్​డెస్క్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపారు. కౌంటింగ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీఆర్ఎస్ ఏకంగా 15 వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ … Read more

Sircilla Municipal Election Results 2026: ఏకపక్ష తీర్పు ఇచ్చిన ప్రజలు!

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా మరోసారి రెపరెపలాడింది. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష తీర్పును అందిస్తూ, కంచుకోటను కాపాడుకునేలా స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. అభివృద్ధిని చూసే ఓట్లు వేశామని సిరిసిల్ల ప్రజలు ఈ ఫలితాల ద్వారా నిరూపించారు. మున్సిపాలిటీలోని మొత్తం 39 వార్డులకు గాను కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. … Read more

చంద్రబాబు బిగ్ స్కెచ్: కేంద్రం నుంచి భారీగా నిధులు.. ఆ మూడు జిల్లాలకు గుడ్ న్యూస్!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కిన కేటాయింపులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు రాబట్టడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం … Read more

ఉత్కంఠ పోరు: మొదలైన మున్సిపల్ కౌంటింగ్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే ఈ ఘట్టం కోసం ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మొత్తం 7 నగర పాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 … Read more

బ్రెయిన్ ట్యూమర్ పై పరిశోధన.. మిట్స్ అధ్యాపకురాలికి డాక్టరేట్

మన పత్రిక వెబ్​డెస్క్, మదనపల్లె: వైద్య రంగంలో సాంకేతికత వినియోగంపై చేసిన పరిశోధనకు గాను మదనపల్లె మిట్స్ (MITS) డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. పుగళరసికి డాక్టరేట్ వరించింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఈ పట్టా లభించినట్లు మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ వెల్లడించారు. ‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్, ఎవల్యూషనరీ ఆల్గోరిథం’ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం, వర్గీకరించడం అనే అంశంపై ఆమె ఈ పరిశోధన … Read more

‘లేట్​గా ఎందుకు వచ్చావ్​?’ అని అడిగిన టీచర్​.. ‘నువ్వెవరు?’ అంటూ కొట్టిన స్టూడెంట్​..

మన పత్రిక వెబ్​డెస్క్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువుపైనే ఓ విద్యార్థి చేయి చేసుకోవడం, అది కూడా చిన్న కారణానికే దాడికి పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. శెహ్రా పట్టణంలోని ఎస్‌జే దవే హైస్కూల్‌లో 12వ తరగతి ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా హాజరైన ఒక విద్యార్థిని, అక్కడ ఇన్విజిలేటర్‌గా ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి … Read more

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల: మే 18న పరీక్ష.. ఫిబ్రవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: న్యాయవాద వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ (TG LAWCET – 2026) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పీజీ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు … Read more

AP SSC Exams 2026 : కొత్త షెడ్యూల్ ఇదే!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రంజాన్ పండుగ దృష్ట్యా మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ అనుమతితో ఈ పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న … Read more