ఈ 3 రాశుల వారికి రాజయోగం, విశేష ధనలాభం! (ఏప్రిల్ 5 – 11)

మన పత్రిక, హైదరాబాద్: గ్రహాల కదలికలు, సంచారాల ఆధారంగా కొత్త వారం (ఏప్రిల్ 5 నుంచి 11 వరకు) రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఈ వారంలో సూర్యుడు, కుజుడు, శని గ్రహాలు మీన రాశిలో సంచరించనున్నాయి. అలాగే బుధుడు కుంభ రాశిలో, శుక్రుడు మేష రాశిలో, గురువు మిథున రాశిలో ఉండనున్నారు. ఇక చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో సంచరిస్తాడు. ఈ విశేష గ్రహాల కలయిక వల్ల ఈ … Read more

TG Inter Result 2026: టీజీ ఇంటర్ ఫలితాలపై అప్‌డేట్..

మన పత్రిక, హైదరాబాద్: Telangana Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ నుంచి 4 లక్షల మంది, సెకండ్ ఇయర్ నుంచి 5 లక్షల మంది.. మొత్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. … Read more

సూర్యాపేట లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం

మన పత్రిక, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. పోలీసు, న్యాయ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,890 కేసులను వేగవంతంగా పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. ఇందులో ఎంవీ … Read more

AP: డిసెంబర్‌ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లు..

మన పత్రిక, నాయుడుపేట: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏర్పాటు చేసిన ‘టిడ్కో’ (TIDCO) సంక్షేమ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కింద ఏకకాలంలో 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రాయచోటిలో … Read more

ఏప్రిల్ 2026 బ్యాంక్ 14 రోజులు సెలవులు..

మన పత్రిక, హైదరాబాద్: ఏప్రిల్ (2026) నెలలో బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే కస్టమర్లకు ముఖ్య గమనిక. రాబోయే ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఆర్థిక సంవత్సర ముగింపు, వరుస పండుగలు, ప్రభుత్వ మరియు వారాంతపు సెలవులు కలుపుకుని ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం సెలవులు ఉండనున్నాయి. ఈ 14 రోజుల సెలవుల్లో 4 ఆదివారాలు, 2 శనివారాలు (రెండో, … Read more

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన ధరలు

మన పత్రిక, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గతవారం వరకు చుక్కలనంటిన చికెన్ ధరలు ఈ వారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో చికెన్‌పై ఏకంగా రూ. 100 వరకు ధర దిగిరావడం విశేషం. మార్చి నెల ఆరంభంలో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో కోళ్లు చనిపోవడం, దాణా ఖర్చులు పెరగడంతో ఫామ్ యజమానులు ధరలు పెంచారు. దానికితోడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ … Read more

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. అగ్నివీర్లకు ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్

మన పత్రిక, న్యూఢిల్లీ: అగ్నివీర్లకు (Agniveers) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు పంపిన విషయాన్ని సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ (రిటైర్డ్) బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ అధికారికంగా వెల్లడించారు. 2027 నాటికి తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న అగ్నివీర్లకు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని హోం మంత్రి … Read more

TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో భయాందోళనలు పెరిగి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పెట్రోల్ కొరత వార్తలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇంధన … Read more

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాల పేర్లు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర తెలంగాణలో ఆల్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే … Read more

ITR Filing: కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి ‘ఫామ్ 16’ రద్దు

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ‘కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ అమల్లోకి రానున్నాయి. దీంతో ఐటీఆర్ (ITR) ఫైలింగ్ విధానం సమూలంగా మారబోతోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే ‘ఫామ్ 16’ (Form 16) రద్దు కానుంది. దీని స్థానంలో మరింత పకడ్బందీగా ఉండే ‘ఫామ్ 130’ని ప్రవేశపెడుతున్నారు. కొత్త పన్ను సైకిల్‌లో ‘ఫామ్ 130’ అత్యంత కీలకం కానుంది. … Read more