Lok Adalat: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

Lok Adalat nizamabad november 15

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి జడ్జి భరతలక్ష్మి (GVN Bharathalakshmi) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 1,328 క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, విభేదాలు వచ్చినప్పుడు రాజీ పద్ధతిలో ముందుకు రావడమే … Read more

ఉపాధ్యాయురాలి వివాదం.. కాళ్లు నొక్కించుకున్న ఘటన కలకలం

srikakulam teacher students massage incident

మన పత్రిక, వెబ్​డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహం రేపగా, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించారు. అధికారులు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఏలూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 50 మంది ప్రయాణికులు!

ap eluru lingapalem private bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా, లింగపాలెం మండలం, జూబ్లీనగర్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు … Read more

chevella: 21 మంది మృతి.. 3 నెలల చిన్నారి సహా!

chevella news

మన పత్రిక, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతుల్లో మూడు నెలల చిన్నారి పాప, ఆమె తల్లి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. రోడ్డు పక్కన తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్న దృశ్యం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు … Read more

పాఠశాలలకు 3 రకాల నిధులు విడుదల.. లిస్ట్ ఇదే!

3 interventions grants released school wise list of Rajanna Siricilla

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మూడు రకాల గ్రాంట్లను విడుదల చేస్తూ పాఠశాలల వారీగా జాబితాను విడుదల చేశారు. ఈ నిధులలో ‘కాంపోజిట్ స్కూల్ గ్రాంట్’, ‘GCEC గ్రాంట్స్’, మరియు ‘ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్’ (పాఠశాలల్లో హౌస్ సిస్టమ్ ఏర్పాటు) గ్రాంట్లు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సహా పలు మండలాల్లోని పాఠశాలలను ఈ … Read more

బీసీ హాస్టల్‌లో పాముల కలకలం.. కాంపౌండ్ వాల్ కట్టాలని విద్యార్థుల వేడుకోలు!

nagarkurnool news

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. తమ హాస్టల్ ప్రాంగణం విషపూరితమైన పాములకు స్థావరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌కు సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే తరచూ పాములు, ఇతర సర్పాలు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. దీనికి తోడు హాస్టల్‌లో సరైన బాత్రూంలు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే … Read more

Chevella: ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి! తాండూరులో విషాదం.

chevella 3 sisters die

మన పత్రిక, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Bus accident in chevella) మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ)గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవల బంధువుల … Read more

Gas cylinder price: సిలిండర్‌పై తగ్గింపు.. కొత్త ధరలు!

Gas cylinder price

మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్‌ సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (19 కిలోలు) ధరను స్వల్పంగా తగ్గించాయి. సిలిండర్‌పై రూ. 5 మేర తగ్గింపును ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నవంబర్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 1,595 నుంచి రూ. 1,590కి చేరింది. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది. అయితే, సబ్సిడీపై అందించే … Read more

Heavy Rains | భారీ వర్షం.. జలమయమైన నగరం, తడిసిన ధాన్యం!

Heavy Rains

మన పత్రిక, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) ఆదివారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) దంచికొట్టింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, ఈ అకాల వర్షం అన్నదాతలను ఆయోమయంలో పడేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యంలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షపు … Read more

Jobs: ప్రభుత్వ ఆసుపత్రిలో 27 నూతన పోస్టులు మంజూరు.. 

tungaturthi hospital jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: తుంగతుర్తి (tungaturthi) వంద పడకల ఆసుపత్రికి 27 నూతన ఉద్యోగాలను మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. మంజూరైన పోస్టుల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కేటగిరీలు, ఆర్ఎంఓ, అనస్తీషియా పోస్టులు ఉన్నాయి. కాగా, రూ. 40 కోట్ల వ్యయంతో 8 నెలల క్రితం ప్రారంభమైన నూతన భవన నిర్మాణం ప్రస్తుతం … Read more