Advertisement

రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షాలు

మన పత్రిక, వాతావరణం: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది. శనివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement