Advertisement

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య, కొడుకును చంపేశాడు

మన పత్రిక, క్రైం: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసి ఇద్దరిని హతమార్చాడు. ఈ సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బాణావత్ రాందాస్ అనే వ్యక్తి ప్రతిరోజులాగే సోమవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య కవితతో వాగ్వాదం తలెత్తింది. క్షణికావేశంలో అదుపుతప్పిన రాందాస్ కత్తితో భార్యతో పాటు కుమారుడు హర్ష, కూతురు ప్రణీతపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య కవిత, కుమారుడు హర్ష అక్కడికక్కడే మృతిచెందారు.

తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రణీతను స్థానికులు ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement