మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు వ్యూహ రచన చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు, సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఎవరికి ఏ బాధ్యత? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన ఇంచార్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
- నల్గొండ: అట్లూరి లక్ష్మణ్
- భువనగిరి: సీతక్క (ధనసరి అనసూయ)
- ఆదిలాబాద్: టి. సుదర్శన్ రెడ్డి
- మల్కాజిగిరి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- చేవెళ్ల: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- మెదక్: గడ్డం వివేక్ వెంకటస్వామి
- ఖమ్మం: కొండ సురేఖ
- మహబూబాబాద్: పొన్నం ప్రభాకర్
- మహబూబ్నగర్: దామోదర రాజనర్సింహ
- జహీరాబాద్: మహమ్మద్ అజారుద్దీన్
- నాగర్ కర్నూల్: వాకిటి శ్రీహరి
- నిజామాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వరంగల్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కరీంనగర్: తుమ్మల నాగేశ్వరరావు
- పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు
ఈ నాయకులు తమకు కేటాయించిన పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్టీ విజయం కోసం సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వీరిదే బాధ్యత అని అధిష్టానం స్పష్టం చేసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
