తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది ( Telangana Two Welfare Schemes for Minorities ) . సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలు, అవివాహిత మహిళలు, ఫకీర్, దూదేకుల వంటి వారికి జీవనోపాధి కల్పించనున్నాయి.
మొదటి పథకం ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ ( Indiramma Minority Mahila Yojana ) కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50,000 ఒకసారి గ్రాంట్ అందిస్తారు. ఇది చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఉపయోగపడుతుంది.
రెండో పథకం ‘రేవంతన్నా కా సహారా’ ( Revanth Anna ka Sahara-Miskeen la Kosam scheme ) కింద ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ.1 లక్ష సహాయం అందిస్తారు. ఈ నిధులతో వారు మోపెడ్ (ద్విచక్ర వాహనం) కొనుగోలు చేసుకోవచ్చు. ఇది వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.
ఈ పథకాలకు మొత్తం రూ.30 కోట్లు కేటాయించారు. ఆన్లైన్ నమోదు సెప్టెంబర్ 19, 2025 నుండి అక్టోబర్ 6, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వారు https://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
