Advertisement

నల్గొండ జిల్లాలో విషాదం.. గణేష్ మండపంలో పూజారి మృతి

వినాయక చవితి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం చింతలపాలెంలో పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ (నాగార్జునసాగర్) మండపంలో పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందారు.

సోమవారం చింతలపాలెంలోని రామాలయం వద్ద గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య వచ్చి తమ మండపం వద్దే ముందు పూజ చేయాలని గొడవకు దిగారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పి, రవి మండపం వద్దకు పూజారిని తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేస్తుండగానే దత్తు ప్రసాద్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ను వెంటనే సాగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement