Advertisement

ఎర్రవల్లి పసుపు నీళ్ల శుద్ధి వివాదం.. ఏడుగురి అరెస్ట్

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (వర్ధరాజపూర్) పసుపు నీళ్ల శుద్ధి ఘటనపై విచారణ వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలను వెలికితీసేందుకు అధికారులు సిట్‌‌ను రంగంలోకి దించారు. దీంతో దర్యాప్తు ప్రక్రియ మరింత కీలక దశకు చేరుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో లోతైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వర్ధరాజపూర్‌లో ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా మారింది.

అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తూ.. ఈ ఘటనకు అసలు ఎందుకు దారితీసింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై పోలీసులు, సిట్ అధికారులు గట్టిగా ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, అందుబాటులో ఉన్న సమాచారం, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. విచారణ పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని సంచలన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement