Advertisement

హన్మకొండ: ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య

CRIME: హన్మకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన స్వప్న (40) అనే మహిళ మూడు నెలల క్రితం అదృశ్యమైన ఘటన హత్యగా తేలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె ప్రియుడే దారుణంగా అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్వప్న పుట్టింట్లోనే ఉంటోంది. పూజలు నేర్చుకునేందుకు కర్ణాటకలోని బళ్లారికి వెళ్లివచ్చే క్రమంలో అక్కడి బసవరాజు(27) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మే 15న బళ్లారికి వెళ్లిన స్వప్న తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బసవరాజును అదుపులోకి తీసుకుని విచారించగా, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే హత్య చేసి బళ్లారి అడవుల్లో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement