మన పత్రిక, విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. ప్లాంట్లోని కోక్ ఓవెన్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా అనంత బార్వే అనే కార్మికుడిపై ఊహించని విధంగా భారీ ఐరన్ బార్ పడింది. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న Vizag Steel Plant పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.
సుమారు నెల రోజుల క్రితమే ఈ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాట్ మెటల్ ఒకేసారి విరుచుకుపడి అగ్నిగోళంలా బద్దలవడంతో పదిమంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఆ విషాద ఘటన నుంచి కోలుకోకముందే మళ్లీ మరో ప్రమాదం జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్కు కర్మాగారంలో పనిచేసే వేలాది మంది కార్మికులకు కనీస ప్రాణ రక్షణ కల్పించాలని, భద్రతా ప్రమాణాలను తక్షణమే పునఃసమీక్షించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- వైసీపీ పాలనలోనే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
- తల్లిని చెల్లిని గౌరవించనివారు రాజకీయాలకు అనర్హులు: సీఎం చంద్రబాబు
- సిద్దిపేటలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 68 మందికి రూ.5.61 లక్షల జరిమానా
- పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం: 10 ఏళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా
