మన పత్రిక: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా ముంబైలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో Rhiya Ahir అనే యువతి పోలీస్ వ్యాన్కు అడ్డుగా నిలబడటం కలకలం రేపింది. జులై 22న ముంబై వీధుల్లో యువత చేపట్టిన ఈ ఆందోళనలో, అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని ఆమె అడ్డుకున్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై వాహనానికి ఎదురుగా చేతులు చాపి నిలబడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి.
ఈ ఘటనపై రియా అహిర్ స్పందిస్తూ, పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు. తాను విద్యార్థిని కాకపోయినా, దళిత లేదా ఒబిసి వర్గానికి చెందకపోయినా, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన చర్యలు తప్పు కాబట్టే నిరసన తెలిపానని పేర్కొన్నారు. వాహనాన్ని అడ్డుకోవడానికి ముందు ఆందోళనకారులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని, వారెంట్ ఉందా అని పోలీసులను ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయక తప్పలేదని చెప్పారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- సిద్దిపేటలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 68 మందికి రూ.5.61 లక్షల జరిమానా
- వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం: కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
- పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం: 10 ఏళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా
- హైదరాబాద్కి సమీపంలో తెలంగాణ లడఖ్గా పేరొందిన విశాఖ కాలనీ
- యువత భవిష్యత్తే ప్రధాని మోదీకి ముఖ్యమని పీవీఎన్ మాధవ్ వెల్లడి
